Breaking:వైసీపీకి బిగ్ షాక్..ఐదుగురు పార్టీ కీలక నేతలు అరెస్ట్

by Jakkula Mamatha |   ( Updated:2024-07-03 09:19:29.0  )
Breaking:వైసీపీకి బిగ్ షాక్..ఐదుగురు పార్టీ కీలక నేతలు అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అల్లర్లు, దాడులు పై ప్రస్తుతం టీడీపీ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 1వ తేదీన మంగళగిరి నియోజకవర్గంలోని టీడీపీ ఆఫీస్ పై 2021 లో జరిగిన దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో పలువురిని అరెస్టు చేశారు. నేడు (బుధవారం) ఐదుగురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. 2021 అక్టోబర్ 19వ తేదీన టీడీపీ కార్యాలయం పై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసీపీ మూకలు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed